ఆర్డిఎస్పై ఈ నెల 28న చర్చలు
– మంత్రి హరీశ్
హైదరాబాద్,ఏప్రిల్ 23(జనంసాక్షి):మహబూబ్ నగర్ జిల్లాలోని రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్.డి.ఎస్) సమస్యపై కర్ణాటకతో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28న చర్చలు జరపనుంది. కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎం.బి.పాటిల్ తో మంత్రి హరీష్ రావు బెంగళూరులో భేటీ కానున్నారు.కర్ణాటక, తెలంగాణ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న ఆర్డీఎస్ వివిధ కారణాలతో తెలంగాణ రైతులకు నీరందించలేకపోతున్నదని హరీష్ రావు కర్నాటక మంత్రికి ఫోన్ లో వివరించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పనులు సైతం మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్నట్టు మంత్రి గుర్తు చేశారు. ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 15.9 టిఎంసిల ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 87 వేల 5వందల ఎకరాలకు ఆర్డిఎస్ నుంచి సాగునీరు అందవలసి ఉండగా.. 5 నుంచి 6 టిఎంసిల నీరు కూడా రావడం లేదని మంత్రి అన్నారు. సమైక్యపాలకుల నిర్లక్ష్యంతో ఏనాడు 20 వేల ఎకరాలకు కూడా సాగునీరు నోచుకోలేదని హరీష్ రావు చెప్పారు.ఆర్.డి.ఎస్ కర్నటకలో నలభై కిలోవిూటర్లు ప్రవహించిన తర్వాత తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. కర్నూలు రైతులు తరచూ తూములు పగులగొట్టడం, కర్ణాటక రైతులు అక్రమంగా నీటిని తరలించుకొని పోవడం వంటి సమస్యలతో ఆర్డిఎస్ ద్వారా రావాల్సిన నీరు రావడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్డిఎస్ ఆధునీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు కర్ణాటక సహకరించడం లేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆర్.డి.ఎస్ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తు 15 సెం.విూ. పెంచడానికి, లైనింగ్ మరమ్మతులకు సంబంధించి గత ఎపి ప్రభుత్వం రూ. 72 కోట్లు మంజూరు చేసి, అందులో 58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినీదని మంత్రి పేర్కొన్నారు. బ్యారేజి సైట్ కర్ణాటక భూభాగంలో ఉన్నందున అవసరమైన నిధులు డిపాజిట్ చేశారని చెప్పారు.కర్నూలు జిల్లా రైతాంగం తరచూ ఆర్డిఎస్ వద్ద ఆందోళనలకు దిగి శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నందున క్షేత్రస్థాయిలో ఆర్డిఎస్ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునీదామని మంత్రి హరీష్ రావు సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందినీచిన కర్ణాటక నీటి పారుదల మంత్రి పాటిల్, ఈ నెల 28 న బెంగళూరు రావలసిందిగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావును ఆహ్వానించారు.