ఆలయ జీర్ణోద్దరణ అరుదైన కార్యం

వల్మిడి రామాలయ జీర్ణోద్ధరణ అభినందనీయం
ఆలయజీర్ణోద్దరణలో పాల్గొన్న చినజీయర్‌ స్వామి
మంత్రి ఎర్రబెల్లి కృషికి అభినందనలు
జనగామ,సెప్టెంబర్‌4 జనం సాక్షి: కొత్త ఆలయం నిర్మించడం కన్నా… ఆలయపునరుద్దరణ గొప్ప విషయమని శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం వల్మిడిలో నిర్మించిన రామాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో త్రిదండి చినజీయర్‌ స్వామి పాల్గొన్నారు. ఆలయాలు నిర్మించడం పెద్ద విషయమేమి కాదని, కాని ప్రాచీన ఆలయాల జీర్ణోద్ధరణ చేయడం చాలా గొప్ప కార్యమని  స్వామి అన్నారు. ఆలయ నిర్మాణంలో విశేష కృషి చేసిన మంత్రి దయాకర్‌ రావును జీయర్‌ స్వామి ఆశీర్వదించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి ఐదు కిలోవిూటర్ల దూరంలోని వల్మీడి గ్రామంలోని వల్మిడి గుట్టపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు నాలుగు రోజులుగా శాస్తోక్తర్రగా జరుగుతున్నాయి. ఆలయ పునరుద్ధరణ కోసం దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.  గుట్టపై అబ్బురపరిచే రీతిలో శ్రీరాముడి ఆలయం రూపుదిద్దుకుంది. భద్రాద్రిని మించి నిర్మించిన ఈ గుడిలో త్రిదండి చినజీయర్‌ స్వామి చేతుల విూదుగా శ్రీసీతారామ లక్ష్మణ సమేత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది.  ఆదర్శపురుషుడు అనగానే గుర్తుకు వచ్చేది శ్రీరాముడు. ఒకప్పటి వాల్మీపుపురమే నేడి వల్మిడి. రాముడి నడయాడిని నేల, రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జన్మస్థలం అంటే నమ్మకం కలగకపోవచ్చు. కానీ, పురాణాతిహాసాలు, తరతరాలుగా స్థానికులు చెప్పుకునే చరిత్రకు ఈ ప్రాంతం సజీవసాక్ష్యంగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారం, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సంకల్పబలంతో వల్మీడి నేడు పుణ్యక్షేత్రంగా మారిపోయింది. వల్మిడిరాములవారి గుట్టపై పునర్‌నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. పాలకుర్తి మండల కేంద్రానికి 5 కిలోవిూటర్ల దూరంలో ఉంటుంది వల్మిడి గ్రామం. దీనికి రెండు వైపులా రెండు గుట్టలున్నాయి. ఒకటి మునులగుట్టు, మరొకటి రాములగుట్ట. మునుల గుట్టపై మునులు తప్పుచేసేవారని, రాముల గుట్టపై సీతారామ లక్ష్మణులు నివసించారని ఇక్కడి వారు చెప్పుకుంటారు. నిర్మానుష్యంగా ఉండే కొండపై 163 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. అంతే కాదు పాలకుర్తి పరిసర ప్రాంతాల్లో దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక కారిడర్‌ అభివృద్ధి చేస్తున్నారు. వల్మిడి ఆలయ పునర్‌నిర్మాణంలో పూర్తిగా బ్ల్యాక్‌ గ్రానైట్‌ ఉపయోగించారు. యాదాద్రి దేవాలయ పునఃనిర్మాణంలో పాల్గొన్న వారే ఈ ఆలయంలో భాగస్వాములయ్యారు. ఆలయ విగ్రహ పునః ప్రతిష్ఠాపన సందర్భంగా నాలుగు రోజుల పాటు ఉత్సవాలు, వైదిక కర్మలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 4న, సోమవారం చినజీయర్‌ స్వామి చేతుల విూదుగా యంత్రప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు జరిగాయి. మరో వైపు సర్వాంగ సుందరంగా ముస్తాబైన వల్మిడి ఆలయానికి తరలివచ్చే భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలను పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దగ్గరుండి పర్యవేక్షించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో హోమగుండ కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే చిన్న జీయర్‌ స్వామి వారిని హోమ గుండానికి సంప్రదాయబద్ధంగా మంత్రి ఎర్రబెల్లి ఆహ్వానించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్‌, నరసింహారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్య శర్మ, కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీప్రసన్‌, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.