ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే?

న్యూఢిల్లీ: నల్లధనంపై యుద్ధం ప్రకcashటించిన మోదీ పెద్ద నోట్లను నిషేధించిన కేంద్రం మరిన్ని ప్రకటనలు చేసింది. నేటి అర్థరాత్రి నుంచి పెద్ద నోట్లు పనిచేయవని, రేపు బ్యాంకులు పనిచేయవని పేర్కొన్న మోదీ అవినీతిపై తమ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఇక నుంచి ఏటీఎం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు డ్రా చేయడం కుదరదు. కేవలం రెండువేల రూపాయలు మాత్రమే తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే కొద్ది రోజుల తర్వాతి నుంచి మాత్రం రూ.4వేలు తీసుకునే వెసులుబాటు లభిస్తుందని పేర్కొన్నారు.