ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి, విధుల నుండి తొలగించాలి.

ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి, విధుల నుండి తొలగించాలి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ…సమాజంలో గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న కొందరు కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సింది పోయి పేకాట ఆడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు అలాంటి వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు పడవుతుందని విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని విధుల నుండి తొలగించాలని అన్నారు గతంలో కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేత మరియు కొందరు ఉపాధ్యాయులు పేకాట ఆడుతూ పట్టుబడిన శాఖపరమైన చర్యలు తీసుకోలేదని వాపోయారు…ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ విషయంపై విచారణ పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే ఆ యొక్క ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో తెలంగాణ విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పవన్, శ్రీకాంత్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.