ఇంటర్‌ విద్యార్థినిపై అసభ్యప్రవర్తన

కళాశాల ప్రిన్సిపాల్‌పై పోలీస్‌ కేసు

హైదరాబాద్‌,జూలై22(జనం సాక్షి : నగరంలోని హయత్‌నగర్‌లో గల గౌతమి గర్ల్స్‌ జూనియర్‌ కాలేజ్‌ చైర్మన్‌ అండ్‌ ప్రిన్సిపల్‌ సత్యనారాయణపై హయత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కళాశాలలో ఇంటర్‌ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినికి మాయ మాటలు చెప్పి సినిమాకి తీసుకుని వెళ్లి సత్యనారాయణ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నెల 16 న ప్రత్యేక క్లాస్‌ చెపుతాను కాలేజ్‌కు రమ్మంటూ ప్రిన్సిపల్‌ విద్యార్థిని ఫోన్‌ చేశాడు. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థిని ప్రిన్సిపల్‌ వ్యవహారాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. విద్యార్థిని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ప్రిన్సిపల్‌ సత్యనారాయణ పరారీలో ఉన్నాడు.