ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ…

సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో

 

కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి / స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం రోజున కేసముద్రం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,పంచాయతీ పాలక వర్గం , సిబ్బంది,స్థానిక ఎస్సై రమేష్ బాబు విచ్చేయగా ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని తెలియజేశారు.