ఇంటి పై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకుం దాం..,

20వ వార్డు కౌన్సిలర్   సంగీత అజయ్ సింగ్ ఠాకూర్.
తాండూరు ఆగస్టు 11( జనం సాక్షి) ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళ పై జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకుందామని 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ పిలుపు నిచ్చారు. గురువారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం పాత తాండూర్ లోని 20వ వార్డు గాంధీనగర్  ప్రాథమిక పాఠశాలలో సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో విద్యార్థుల తో ఆజాదిక అమృత్సవ్ కార్యక్రమంలో భాగంగా  ర్యాలీని నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు స్లొగన్స్ పాడిస్తూ ఇంటింటికి వెళ్లి జెండాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మట్లాడుతూ వార్డులో ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లపై జెండాలను ఎగురవేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ మాధవి రాణి ,అంగన్వాడీ టీచర్ రాధ, ఆర్ పి శోభ, ఆశా వర్కర్ సుజాత, ఏఎన్ఎం సిస్టర్ మాధవి, మున్సిపల్ బిల్ కలెక్టర్స్ అనిల్, శ్రీనివాస్, మున్సిపల్ స్టాప్ కాలనీవాసులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.