ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

– 30వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె.
– మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య.
ఊరుకొండ, ఆగస్టు 23 (జనం సాక్షి):
వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను.. బహిరంగంగా బహిరంగంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఊరుకొండ మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య డిమాండ్ చేశారు. మంగళవారం 30వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఊరుకొండ మండల వీఆర్ఏ జేఏసి చైర్మన్ సత్తయ్య మాట్లాడుతూ.. వీఆర్ఏలకు
పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ బీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

23యుకే01, 30వ రోజు నిరవధిక సమ్మెలో ఊరుకొండ మండల వీఆర్ఏలు.