ఇచ్చే గడువు దాటిన అందని రేషన్ బియ్యం

.. లబోదిబో అంటున్న వినియోగదారులు
బచ్చన్నపేట సెప్టెంబర్ 15 (జనం సాక్షి)

పేదల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ సరుకులు ప్రతినెల రెండు మూడు తేదీల నుండి 15వ తారీకు వరకు ఇచ్చే రేషన్ బియ్యం ఇంతవరకు రాకపోవడంతో ప్రజలు లబోదిబో అంటున్నారు. రెక్కాడితే కానీ కడుపునిండని నిరుపేద కుటుంబాలు రేషన్ సరుకులు లేక పలు గ్రామాల ప్రజలు డీలర్ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ బియ్యం రాలేదని చెప్పడంతో వెనుతిరిగి పోతున్నారు. సర్పంచులను ప్రజాప్రతినిధులను అడిగినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిరుపేద కుటుంబాలకు రేషన్ బియ్యం అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.