*ఇద్దరు పసికందుల ప్రాణాలు తీసిన ముర్కత్వ తండ్రి*

జనం సాక్షి నాగర్ కర్నూల్ :-నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంట మధ్య కుటుంబ కలహాలు చిచ్చురేపాయి. ఇద్దరు మధ్య వచ్చిన మనస్పర్ధలతో ఇద్దరి ప్రేమ గుర్తుగా జన్మించిన పిల్లల్ని కత్తితో గొంతు కోసి తాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కొడేరు మండలం కుడికిళ్ల గ్రామంలో చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుడికిళ్ల గ్రామానికి చెందిన మొట్టే ఓంకార్(35) అదే గ్రామానికి చెందిన మరో మహిళ శివలీలను ప్రేమించి మూడో వివాహం చేసుకున్నాడు. ఇద్దరి ప్రేమ గుర్తుగా చందన (3) విశ్వనాథం 9 నెలలు సంతానం.బుధవారం మధ్యాహ్నం భార్య పిల్లలతో కలిసి బైక్ పై కుడికిళ్ల నుండి ఎత్తం వైపు వెలుతుండగా మార్గమధ్యలో భార్య కోపంతో బైక్ పై నుండి కిందికి దూకింది. అనంతరం డైల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని కనుక్కొనెలోపే చిన్నారులను గొంతు కోసి తానూ గొంతు కోసుకుని కనిపించారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న తండ్రిని హుటాహుటిన పోలీసులు జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఓంకార్ మొదటి భార్య కృష్ణవేణి  మరణించగా ఎత్థం గ్రామానికి చెందిన లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు, వీరికి కూడా ఒక పాప, బాబు ఉన్నారు. దీనిపై  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.