ఈజిప్టుతో ఏడు కీలక ఒప్పందాలపై భారత్‌ సంతకం

న్యూఢిల్లీ : పరస్పర ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్‌, ఈజిప్టు దేశాలు ఈరోజు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. సైబర్‌ సెక్యూరిటీ కూడా వీటిల్లో ఒకటి కావడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఈజిప్టు అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ ఈరోజు ఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తమ మధ్య ఫలప్రదమైన చర్చలు జరిగాయని, ఇరుదేశాల సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని చర్చల అనంతరం వారు ప్రకటించారు.