ఈడీ ముందు హాజరైన చిదంబరం
న్యూఢిల్లీ,జూన్12(జనం సాక్షి ): మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఎయిర్సెల్ – మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆయనను రెండోసారి ప్రశ్నించారు. ఇడీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం చిదంబరం మంగళవారం ఉదయం 11 గంటలకు ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనను ఈ నెల 5న మొదటిసారి 6 గంటలపాటు ప్రశ్నించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం స్టేట్మెంట్ను రికార్డు చేశారు. మంగళవారం రెండోసారి ప్రశ్నించారు. చిదంబరం స్టేట్మెంట్నురికార్డు చేసే అవకాశం ఉంది.