ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాల ముఖ ద్వారనికి పూజలు

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు23(జనంసాక్షి):
బోనాల పండుగ సందర్భంగా మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని ఈదమ్మ పోచమ్మ ఎల్లమ్మ ఆలయాలకు వెళ్లే దారిలో ఇటీవల నిర్మించిన ఆలయ ముఖ ద్వారానికి తిమ్మాజీపేట్ పాండు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉత్సవ నిర్వాహకులు కాలనీవాసుల పుర ప్రముఖుల ఆర్థిక సాయంతో ఆలయముఖ ద్వారాన్ని నిర్మించినట్లు తెలిపారు .ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాట్లు వివరించారు. అనంతరం ఆలయం వరకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి జాజుల బాలరాజు ఉత్సవ నిర్వాహకులు శ్రీనివాసరావు జగదీష్ కౌన్సిలర్లు నిజామోద్దీన్ సునీంద్ర కాలనీ వాసులు రమేష్ రావు శేఖర్ మేస్త్రి కృష్ణయ్య సత్యం రాజారావు భాను ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.