ఈనెల 29న తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలి*

టిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్. తాటికొండ సీతయ్య
తుంగతుర్తి అక్టోబర్ 27 (జనం సాక్షి)
ఈనెల 29 న తిరుమలగిరి మండల కేంద్రంలో కెసిఆర్ పాల్గొనే. భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య టిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గానుగు బండ సూర్య తండా గుట్ట కింది తండ గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ను ముచ్చటగా మూడోసారి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ బిఅర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు ఏవిధంగా చేరుతున్నవి అని తెలుసుకోని బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో గురించి వివరించి కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు .నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలపై కృషి చేస్తు గడప గడపకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను మూడవ సారి కారు గుర్తుకు ఓటు వేసి మూడవ సారి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన గ్రామాలు అభివృద్ధికై కృషిచేయాలని కోరారు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాకు నాయక్. గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్ లాల్. ఉప సర్పంచ్ భద్రమ్మ. గానుగు బండ ఉప సర్పంచ్ పోలపాక పరమేష్, మాజీ ఎంపిటిసి దుర్గయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గుండగాని శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు కంచర్ల కుశలవ రెడ్డి, యూత్ అధ్యక్షుడు పంజాల ప్రవీణ్,వీరన్న, పంజాల యాదగిరి,గుండ గాని సురేష్, పోలెపాక సోమయ్య, మల్లేష్, రమేష్, వార్డ్ మెంబర్లు సూర్య ప్రకాష్, కట్ల చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.