ఉగ్రవాదులకు పాక్‌ సహయం:కేంద్రహోంమంత్రి షిండే

న్యూఢిల్లీ: దేశంలో ప్రవేశించే ఉగ్రవాదలకు పాక్‌ సాయం చేస్తోందని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. దేశ సరిహద్దుల్లోంచి దొంగచాటుగా ప్రవేశించే ఉగ్రవాద ముఠాలకు పాక్‌ అన్ని రకాల సహాయం అందిస్తుందని నిఘావర్గాలు వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అయితే ఏలాంటి  సవాళ్లనయినా ఎదుర్కొందుకు భద్రతాదళాలు సిద్ధంగా ఉన్నాయని కాశ్మీర్‌ పరిస్థితులు సాధారణస్థాయికి చేరినవెంటనే అక్కడి సైన్యాన్ని ఉపసంహరిస్తామని హామినిచ్చారు.