ఉచితంగా పంపిణీ చేసే మట్టి వినాయకులనే పూజించండి

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 30 :: పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకులనే వాడాలని తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్ పేర్కొన్నారు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు మట్టి వినాయకులను నిమజ్జనం చేస్తే చెరువులో నీరు కలుషితం కాదని ఎలాంటి కెమికల్ లేకుండా ఉంటాయని ఆయన తెలిపారు   పర్యావరణానికి హాని కలిగించే కెమికల్ రంగు విగ్రహలను కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేసి చెరువులో నిమజ్జనం చేస్తే చెరువు పరిశుభ్రంగా ఉండి పాడి పశువులు నీళ్లు తాగినా ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజలంతా ఆనందం తో పండుగను జరుపు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మామిడి వెంకటేష్ గారు,సత్య లింగం మున్సిపల్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ పాల్గొన్నారు