ఉచిత పశువైద్య శిబిరం మరియు పాడి రైతుల అవగాహన

 

రైతులు వినియోగించుకోవాలి ఉమ్మడి నల్గొండ జిల్లా డిఎల్ డిఎ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 18 (జనంసాక్షి) ఆత్మకూరు మండలంలోని ఖప్రయపల్లి గ్రామంలో పశుగణభివృద్ధి సంస్థ ఉమ్మడి నల్లగొండ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా మేలు జాతి ఆడ దూడలు జన్మించే విధంగా వీర్య నాలికలను విడదీసిన వీర్యాన్ని ఎదకు వచ్చిన పశువుకు సరి అయిన సమయంలో కృత్రిమ గర్భాధారణ చేసి మేలు జాతి ఆడదుడని జన్మించే విధంగా చర్యలు చేపడుతున్నామని త్వరలో రైతులకు అందుబాటులో ఉంచుతామని రైతులు వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూస్తామని ఈ విధానాన్ని రైతులు సద్వినియం చేసుకోని పశు గణాభివృద్ధి ద్వారా 675 రూపాయలు విలువగల వీర్యాన్ని రైతులకు 250 రూపాయలకే సబ్సిడీతో అందిస్తామని మరియు మొదటిసారి కృత్రిమ గర్భాధారణతో చుడి నిల్వకపోయినా రెండవసారి కృత్రిమ గర్భధారణ చేసినట్లయితే వారికి మొదటిసారి 250 రూపాయలు తిరిగి ఇవ్వబడును కావున రైతు సోదరులు వినియోగించుకుని జిల్లాలో ఈ మండలాన్ని పశు సంపదను అగ్రగామిగా నిలిచే విధంగా పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా సేవలందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా సర్పంచ్ సామ వరలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీ మార్యల వెంకటేష్ ఇఓ మల్లికార్జున్ ఇసి మెంబర్ దశరథ గుప్త మదర్ డైరీ పాల సంఘం చైర్మెన్ బచ్చే నర్సింహ మండల వెటర్నరీ డాక్టర్లు సంతోష్ మల్లికార్జున్ గిరి ఉపసర్పంచ్ రషీద్ మండలంలోని వివిధ గ్రామాల పాలసంఘం చైర్మెన్ లు సూపర్ వైజర్ లు గోపాలమిత్రలు మైత్రి రైతులు తదితరులు పాల్గొన్నారు