ఉజ్జయినిలో హోలీ సంబరాలు

మధ్యప్రదేశ్‌ :మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ పూజారులు టెంపుల్‌లోని శివలింగానికి అభిషేకం చేశారు. అమ్మవారి విగ్రహాన్ని పసుపు, కుంకుమల.. పూల మాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగే హోలీ సంబరాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని రంగులకేళిలో లీనమయ్యారు.