ఉత్తమ ర్యాంక్ లుసాధించిన విద్యార్థినిలను సన్మానిచ్చిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం

లంపూర్ జూన్29(జనంసాక్షి) అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే కార్యాలయం లో బుధవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం వారు వనపర్తి జిల్లా కేంద్రంలో విజ్ఞాన్ జూనియర్ కాలేజి లో చదువుతున్న,ఉదండ పురం గ్రామానికి  చెందిన స్టేట్ లో 2 వ రాంక్ సాధించిన  T. పూజిత M.P.C. 991/1000,మరియు  ఉమ్మడి జిల్లాలో  1 వ రాంక్ సాధించిన చాగపురం గ్రామం  k.కీర్తి  B.P.S. 953/1000  మరియు ఉదందపురంగ్రామం K. ఝాన్సీ B.P.C 949/1000, కొండేర్ గ్రామం K.మమత B.P.C. 430/440 మార్కులు సాధించిన  వారికి  శాలువా పూలబోకే తో సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ జన్మనిచ్చిన   తల్లిదండ్రులకు  చదువుచెప్పిన గురువులకు మంచి పేరు తేవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రాజేష్ , రాజ వర్ధన్ రెడ్డి శ్రీ అక్షర స్కూల్ ప్రిన్సిపల్ , అధ్యాపకులు శిఖామణి  శ్రీను  చెన్నయ్య  నాగేశ్వర్ రెడ్డి  మరియు తదితరులు ఉన్నారు..