ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎన్నికల ప్రచారం
ఉత్తరప్రదేశ్లో ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేటి నుంచి పరివర్తన్ యాత్ర ప్రారంభించనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పరివర్తన్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. బహిరంగ సభలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు పలువురు మాట్లాడనున్నారు. యూపీలో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ నేత చంద్ర మోహన్ తెలిపారు. పరివర్తన్ యాత్రలో భాగంగా నిర్వహించే ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని పేర్కొన్నారు.