ఉపాధి నిధులపై సమీక్షా సమావేశం

చిలుకూరు : మండలంలోని పదమూడు పంచాయతీల్లోని ఐదు ఆవాస గ్రామాల్లో పదినెలలుగా జరిగిన ఉపాధి పనులకు రూ,3,47,08,137. నిధులు ఖర్చుయ్యాయి,ఈనిధులపై స్పెషల్‌ ఆడిట్‌ సిబ్బంది గ్రామాల వారీగా ఆడిట్‌ నిర్వహిస్తున్నారు. గురువారం మడలం పరిషత్‌ కార్యాలయంలో  ఎంపీడీవో నాగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీఆర్పీలు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.