ఉపాధి హామీ డబ్బుల కోసం కూలీల ధర్నా

ఖమ్మం,(జనంసాక్షి): ఉపాధి హామీ తాము చేసిన కూలీ డబ్బులు చెల్లించాలని కొత్తగూడెం ఎంపీడీవో ఆఫీస్‌ ముందు సుజాతనగర్‌ కూలీలు ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడికి పోలీసులు చేరుకుని పలువురు కూలీలను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు