: ఉప్పొంగిన జాతీయ భావం ఎమ్మెల్యే మైనంపల్లి

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 16

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ పేరుతో సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 16న సామూహిక జాతీయ గీతలాపనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్వాల్ పట్టణ కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర సామూహిక జనగణ కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హాజరై 11:30 నిమిషాలకు జాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రభుత్వ అధికారులతో పాటు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నాగమణి తాసిల్దార్ నాగమణి సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ సబిత అనిల్ కిషోర్ ఎస్సై పరశురాం టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండల్ రెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, నాగేశ్వరరావు, రాజసింహారెడ్డి, బలవంత రెడ్డి, ప్రవీణ్, శ్రీశైలం యాదవ్, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్ గౌడ్, దేవేందర్, జ్యోతి యాదవ్, కవిత, భబిత, సులోచన, గాయత్రి, పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.