ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

యాచారం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, బిజెపి నాయకులు శ్రీనివాస్ గుప్త

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై    (జనంసాక్షి):- ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని   యాచారం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, బిజెపి నాయకులు శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు.  శుక్రవారం శ్రీనివాస్ గుప్త యాచారంలో మీడియాతో మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో జగిత్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న  క్రమంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎంపీ అరవింద్ పై దాడులు చేయడం  హేయమైన చర్య అన్నారు.  ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కొనే సత్తా లేక టిఆర్ఎస్  ఇలాంటి దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి లభిస్తోన్న ఆదరణను జీర్ణించుకోలేక దాడులకు పాల్పడుతుందని అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని ప్రజా క్షేత్రంలో టీఆర్ఎస్ నాయకులకు తగిన మూల్యం తప్పదని శ్రీనివాస్ గుప్త  హెచ్చరించారు.