ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా చొప్పరి శరత్

కేసముద్రం ఆగస్టు 8 జనం సాక్షి / జిల్లా కేంద్రంలోని షాదీఖానలో జరిగిన జిల్లా 3వ మహాసభలో ఎఐఎస్ఎఫ్ జిల్లా నూతన జిల్లా కమిటీని ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్ ప్రకటించారు.ఈ జిల్లా కమిటీ ఎన్నికలో భాగంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శిగా మండలంలోని కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన చొప్పరి శరత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా చొప్పరి శరత్ మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకం ఉంచి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్న ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని ఉద్యమాలు నిర్వహిస్తానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు గాలికి వదిలేసాయని ఆరోపించారు. నాకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగిస్తూ పోరాడుతానని అన్నారు. నా ఎన్నికకు సహాకరించిన ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్,ఎఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి బి.విజయ సారథి,ఎఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు బి.అజయ సారథి, ఎఐఎస్ఎఫ్ జిల్లా నిర్మాణ బాధ్యులు పెరుగు కుమార్,సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, ఎఐఎస్ఎఫ్ మాజీ జిల్లా సహాయ కార్యదర్శి మంద భాస్కర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
చొప్పరి శరత్ ఎన్నికపట్ల ఎఐఎస్ఎఫ్ నాయకులు సొమారపు సందీప్, ఎన్. సూర్య సారథి, ఎం. శివ, బి.దేవేందర్ లు హర్షం వ్యక్తం చేశారు.