ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్‌గఢ్ : నారాయణపూర్ జిల్లాలోని బేషా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా, ఒక జవానుకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.