ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు 

నలగొండ బ్యూరో, మే12 (జనం సాక్షి) : ఇప్పటివరకు పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసులకు ఉపక్రమించినట్లు  జిల్లా కలెక్టర్  హరి చందనదాసరి తెలిపారు. ఈ మేరకు ఆమె  ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు. విధులకు రిపోర్ట్ చేయని వారు తక్షణమే రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసారు.ఈ మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అందరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నాగార్జునసాగర్, మునుగోడు, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సిబ్బంది గైర్ హాజరైనట్లు తెలిపారు.