ఎమ్మెల్యే ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు

 కేసముద్రం ఆగస్టు 13 జనం సాక్షి  / ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను గతంలో సస్పెండ్ చేయగా తిరిగి వారిని విధుల్లో తీసుకునేటట్లు కృషిచేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను శనివారం రోజున కలసి  ఫీల్డ్ అసిస్టెంట్లు కృతజ్ఞతలు తెలియజేశారు.ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ఫీల్డ్ అసిస్టెంట్లను భాగస్వాములను చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. గ్రామాభివృద్ధికి తోడ్పడాలని వారికి సూచించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఎవరి పొట్ట కొట్టలేదు అందరూ ఉద్యోగులకు న్యాయం  చేస్తున్నారని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ లకు భవిష్యత్తులో మంచి జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  ఓలం చంద్రమోహన్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మాదారపు సత్యనారాయణ రావు, మార్కెట్ చైర్మన్   మర్రి నారాయణ రావు ,వైస్ ఎంపీపీ రావుల  నవీన్ రెడ్డి, టిఆర్ఎస్  పార్టీ మండల అధ్యక్షులు నజీర్ అహ్మద్, కేసముద్రం పట్టణ అధ్యక్షులు గూగులోతు వీరు నాయక్ ,మరియు ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర నాయకులు మంచాల కుమార్, కేసముద్రం మండల అధ్యక్షులు  నానబాల రమేష్, శ్రీనివాస్, మల్లయ్య, రమ, ఉమా , తాహేర,అనిల్, శ్రీనివాస్, రాము, లావణ్య, రాజశేఖర్, రమేష్ ,శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.