ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.

ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.

బెల్లంపల్లి, అక్టోబర్ 27, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం ఉదయం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు 2023 సందర్బంగా ఎన్నికల్లో డబ్బు, మద్యం అక్రమ రవాణా నిరోధించడానికి ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంపూర్ణంగా సహకరించారు. ఆయన వాహనంలో ఎలాంటి నగదు లభించలేదని పోలీసులు తెలిపారు