ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు స్వాగతం పలికిన నాయకులు

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 14:

గత కొద్ది రోజుల క్రితం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు కరోనా పాసిటివ్ రాగా కరోనా బారి నుండి కోలుకున్న అనంతరం మొట్టమొదటిసారిగా ఆదివారం హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ కు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సహా ఎంపీపీలు ,జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, నాయకులు ఘన స్వాగతం పలికారు. వేద పండితులచే ఎమ్మెల్యేకు గుమ్మడికాయలు, టెంకాయలు తో దిష్టి తీసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతోనే కరోనా మహమ్మారి నుంచి సత్వరంగా కోలుకున్నానని, ప్రజలు చేసిన పూజలు, ఆకాంక్షల వల్లే తాను తిరిగి మళ్లీ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధమయ్యానని ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు.