ఎమ్మెల్యే సమక్షంలో 250 కుటుంబాలు తెరాసపార్టీలో చేరికలు

అశ్వరావుపేట సెప్టెంబర్ 19( జనం సాక్షి )

నియోజకవర్గంలోని దమ్మపేట మండలం తాటి సుబ్బన్న గూడెం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 250 కుటుంబాలు సోమవారం స్థానిక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సమక్షంలో చేరారు. సిపిఐ నాయకుడు పండూరి వీరబాబు ఆ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరారు అలాగే ఇతర పార్టీలకు చెందిన వివిధ నాయకులు,కార్యకర్తలు,యువకులు టీఆరెఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరావు వారికి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు ప్రవేశ పెట్టడం వలనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు టిఆర్ఎస్ లో చేరుతున్నారని ప్రతి నాయకుడిని,కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్,అబ్దుల్ జిన్నా,కవులురి నాగయ్య,తదితరులు ఉన్నారు.