ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని

erracotaదేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని హోదాలో ఆయన మూడోసారి ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు ప్రదాని. అనంతరం ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వేలాది మంది విద్యార్ధులతో పాటూ కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.