ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్నిప్రమాదం
వరంగల్,సెప్టెంబర్5(జనం సాక్షి): వరంగల్ నిట్ క్యాంపస్ సవిూపంలో ఉన్న ఓ ఎలక్ట్రికల్ దుకాణంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని తెలిపారు. షార్ట్సర్కూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.