ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గంధం కళ్యాణ్*
*గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (23):* భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల వాల్  పోస్టర్ ను  గోపాల్ పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా అధ్యక్షుడు గంధం కళ్యాణ్  విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను, నూతన విద్యా విధానంలో విద్యావ్యవస్థను నాశనం పట్టించే విధంగా ఉన్నాయని అన్నారు విద్యా కాషాయకరణకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని  అందుకోసం 17వ జాతీయ మహాసభలు హైదరాబాద్ ఓయూ యూనివర్సిటీలో  డిసెంబర్ 13 నుంచి 16 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతీయ మహాసభలు విజయవంతనికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ మహాసభలకు భారత దేశం నలుమూలల నుంచి  ఎస్ఎఫ్ఐ నాయకులు వస్తారన్నారు ఈ మహాసభలో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి పోరాటానికి సిద్ధం కావడం జరుగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో గోపాలపేట మండల కార్యదర్శి రాజేష్ , ప్రవీణ్ సాయి ,భరత్ , నరేష్, శ్రీవాణి ,పల్లవి, విద్యార్థులు  పాల్గొన్నారు