ఏఎన్-32 గాలింపుకు అమెరికా సాయం కోరిన భారత్
బంగాళాఖాతంలో అదృశ్యమైన ఎ.ఎన్-32 విమానం కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. దాదాపు పదిరోజులైన విమానం జాడ తెలియకపోవటంతో కేంద్రం.. అమెరికా సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అమెరికాను సహాయం అడిగినట్లు రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. సముద్ర అడుగు భాగంలో వెతికేందుకు అమెరికా.. భారత్ కు సహాయం అందించనుంది.