ఏఎస్సైని చితకబాదిన మావోయిస్టులు

e5b2br2rచత్తీస్‌గఢ్‌లో ఓ ఏఎస్ఐని మావోయిస్టులు చితకబాదారు. సుక్మా జిల్లా పోలంపల్లి స్టేషన్ ఏఎస్ఐ దేవాంగి, మరో కానిస్టేబుల్ తో కలిసి బైక్ పై గోరుగూడ వైపు వెళ్తుండగా.. వారిని మావోయిస్టులు అటకాయించారు. నక్సల్స్‌ చూస్తుండగానే వాహనం వెనుక కూర్చున్న కానిస్టేబుల్ పారిపోగా, ఏఎస్ఐ మాత్రం దొరికిపోయాడు. అతణ్ణి మావోయిస్టులు కర్రలతో విపరీతంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక కిందపడిపోయిన దేవాంగిని మావోయిస్టులు అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు. తర్వాత ఆ దారిలో ప్రయాణించిన కొందరు వ్యక్తులు పోలంపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక బలగాలు అక్కడికి చేరుకొని బాధితుణ్ణి దోర్నపాల్ ఆసుపత్రికి తరలించారు. ఏఎస్ఐ దేవాంగికి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారని పోలీసులు చెప్పారు. కాగా మావోయిస్టులు చేతికి చిక్కిన పోలీసును చంపేయకుండా కొట్టి వదిలేయడం ఇదే ప్రథమం.