ఏటీఎంలో 50రూపాయల నోట్లు!!

atmపెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  500, 1000 రూపాయలు రద్దు చేయడంతో జనం చిన్న నోట్ల కోసం ఎగబడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఆర్‌బీఐ ఓ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అన్ని ఏటీఎం సెంటర్లలో 50రూపాయల నోట్లు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఇప్పటివరకూ 100 నోట్ల సంఖ్యను పెంచిన ఆర్బీఐ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 50 రూపాయల నోట్లను కూడా ఇక నుంచి ఏటీఎంల్లో అందుబాటులోకి తేవాలని నిర్ణయించున్నట్లు సమాచారం. అయితే కేవలం నిబంధన ప్రకారం రోజుకు 2వేల రూపాయలు మాత్రమే డ్రా చేయాలట. ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే చాలామంది కష్టాలు తీరనున్నాయి.