ఏడుకొండలు ఆత్మహత్య కు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: మేరావత్ ముని నాయక్

ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఇటీవల నల్లగొండలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల పరిధిలోని నాయకుని తండా గ్రామానికి చెందిన తుంగతుర్తి ఏడుకొండలు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నాగార్జునసాగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మేరావత్ ముని నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఆశయాల కోసం అయితే నిరుద్యోగులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వెయ్యాలని, తుంగతుర్తి ఏడుకొండలు కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ,రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు .
ఫోటో రైట్ అప్: ముని నాయక్