ఏపీ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ

రాజధాని నిర్మాణంపై అనుమానాలు వద్దన్న సభ్యులు
హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమయ్యింది. టిడిపి  సభ్యుడు టి.శ్రావణ్‌కుమార్‌ చర్చ ప్రారంభిస్తూ  రాజధాని నిర్మాణంపై రైతులకు నమ్మకం ఉందని, రాజకీయ పార్టీలకు లేదన్నారు. రాజధాని నిర్మాణంపై రైతులకు నమ్మకం ఉంది కానీ రాజకీయ పార్టీలకు లేదన్నారు. రాజధాని నిర్మాణంలో అపోహ అవసరం లేదన్నారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఆముదాల వలస తెదేపా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ… ప్రపంచంలో ఆంధప్రదేశ్‌కు గుర్తింపు రావాలంటే అత్యున్నత రాజధాని కావాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని రవికుమార్‌ కోరారు. రాజధాని నిర్మాణంలో అపోహ అవసరం లేదన్నారు. ఆముదాల వలస తెదేపా ఎమ్మెల్యే కూన రవికుమార్‌ మాట్లాడుతూ… ప్రపంచంలో ఆంధప్రదేశ్‌కు గుర్తింపు రావాలంటే అత్యున్నత రాజధాని కావాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని రవికుమార్‌ కోరారు.