ఐఎన్టియుసి బల్మూరు మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

అచ్చంపేట ఆర్సి, సెప్టెంబర్ 29, (జనం సాక్షి న్యూస్): నియోజకవర్గ పరిధిలోని బల్మూరు ఐ ఎన్ టి యూ సి మండల కమిటిని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా సూచనల మేరకు ఐ ఎన్ టి సి తాలూకా అధ్యక్షుడు మహబూబ్ అలీ ఆధ్వర్యంలో మండల ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడిగా చందు నాయక్ ఉపాధ్యక్షుడిగా రాజు ప్రధాన కార్యదర్శి స్వామి గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి మరియు నాయకులు రాంప్రసాద్ వీరేష్ ప్రధాన కార్యదర్శి ఎస్కే అమీర్ అంజి తదితరులు పాల్గొన్నారు