ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడిగా ఎండి మహబూబ్అలీ నియామకం.

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 25( జనం సాక్షి న్యూస్) : ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన కాంగ్రెస్ నేత మైనార్టీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండి మహబూబ్ అలీ నియామక పత్రాన్ని డిసిసి అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఎండి మహబూబ్ అలీ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి తన సేవలను గుర్తించి తనకు ఈ బాధ్యతలను అప్పజెప్పిన ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా మరియు రాష్ట్ర టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ నాకు కృతజ్ఞతలు తెలిపారు దీంతో మరింత పట్టుదలతో ఎల్లవేళలా కాంగ్రెస్ పార్టీ ని అధికారం తేవడం కోసం పాటుపడతానని, కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఐఎన్టీయూసీ తరఫున వారి సమస్యల పరిష్కారం కొరకు ఎల్లవేళలా పోరాటానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు నరసయ్య యాదవ్ ,గౌరీ శంకర్,కటకం రఘురాం, రామనాథం, చత్రు నాయక్,తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.