ఐఏఎస్‌అధికారి అనుమానాస్పదస్థితిలో మృతి

rlim9l94కర్ణాటక కోలార్ జిల్లాలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపిన ఐఏఎస్ అధికారి డీకే రవి(35) అనుమానాస్సద రీతిలో మృతి చెందాడు. బెంగళూరు నగరంలోని తావరెకెరెలో రవి తన నివాసంలోఉరివేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రవి ప్రస్తుతం వాణిజ్య పన్నుల విభాగంలో అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని నెలల క్రితం కొంతమంది బడావ్యాపారులకు పన్నుల విషయంలో నోటీసులు జారీచేశాడు.
ఈ విషయంలో ఏమైనా విబేధాలు వచ్చి వారి ప్రమాదం పొంచి ఉందని ఆత్మహత్యకు పాల్పడ్డాడా అని అనుమానిస్తున్నారు.లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రవి.. కోలార్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన సమయంలో ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల మన్నలు పొందారు. గత అక్టోబర్ లోనే వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అటు ఇసుక మాఫియా ముఠా రవిని హత్యచేసి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.