ఐఏఎస్ అధికారి సస్పెన్షన్‌పై నివేదిక కోరిన కేంద్రం

Latest News

న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారి సస్పెన్షన్ పై నివేదిక సమర్పించాలని బీహార్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. భూదందాలు జరుపుతున్న మాఫియాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై బీహార్ ప్రభుత్వం 2005 బ్యాచ్ బీహార్ క్యాడర్‌కు చెందిన అధికారి కుల్‌దీప్ నారాయణ పై డిసెంబర్ లో సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ విషయంపై స్పందించిన కేంద్రం ఐఏఎస్ అధికారి సస్పెన్షన్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.