ఐటిశాఖ తలుపుతడుతున్న ఫిర్యాదులు
కోటి నజరానా ప్రకటనతో ప్రజల్లో వెలువలా స్పందన
న్యూఢిల్లీ,జూన్9(జనం సాక్షి ): నల్లధనం వెలికితీత కోసం ఆదాయపు పన్ను శాఖ ఇటీవల ప్రకటించిన కోటి రూపాయల రివార్డు స్కీమ్ సత్ఫలితాలు ఇస్తోంది. ప్రకటన చేసిందే తడవుగా పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈామోయిల్స్, పోస్టులో ఫిర్యాదులకు కూడా లెక్కలేకుండా పోతోంది. ఈ స్కీమ్ ప్రకటించిన దగ్గర్నుంచి ఐటీ డిపార్ట్మెంట్ ఫోన్లతో మారుమోగిపోతోంది. అంతేకాక కుప్పలు తెప్పలుగా ఈామెయిల్స్, కొరియర్స్ వచ్చి పడుతున్నాయి. ఈ స్కీమ్ ప్రకటించిన తొలి రోజు నుంచి అంటే జూన్ 1 నుంచి ఇన్ఫార్మర్ల దగ్గర్నుంచి భారీగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని డిపార్ట్మెంట్కు చెందిన కమిషనర్ స్థాయి అధికారులు చెప్పారు. గత వారమే ఐటీ డిపార్ట్మెంట్, ఇన్ఫార్మర్లకు ఇచ్చే రివార్డు స్కీమ్ను సవిూక్షించింది. దీని కింద బినామి లావాదేవీ లేదా ఆస్తికి సంబంధించి ఆదాయపన్ను విభాగానికి ఏదైనా నిర్దిష్ట సమాచారాన్ని వెల్లడిస్తే, పన్ను సమాచార వ్యవస్థ, వారికి కోటి రూపాయల విలువైన రివార్డు అందజేస్తుందని ప్రకటించింది. ఈ ఫిర్యాదుల్లో ఎక్కువగా వ్యాపారాఉలు, రాజకీయ నేతలపైనే ఫిర్యాదులు ఉంటున్నట్లు సమచారం. అదేవిదంగా విదేశాలలో ఉన్న నల్లధనం గురించి సమాచారం అందించిన వారికి సుమారు రూ.5 కోట్ల దాక నజరానా అందిస్తారు. అలాగే, సమాచారం అందజేసిన వ్యక్తికి సంబంధించిన వివరాలు అత్యంత గోప్యంగ ఉంచుతామని పన్ను శాఖ తెలిపింది. దీంతో వారంలోనే ఈ రివార్డుకు సంబంధించి 500 కాల్స్ పైగా వచ్చాయని సీబీడీటీ అధికారులు చెప్పారు. వీటిలో అవసరం లేని కాల్స్, కొరియర్స్ కూడా వస్తున్నాయని పేర్కొంది. ఈామెయిల్స్ను తనిఖీ చేసిన అనంతరం, సంబంధిత విచారణ విభాగానికి ఫిర్యాదులను ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్పారు. కొన్ని ఫిర్యాదులు ఏకంగా 500 పేజీలకు పైగా ఉంటున్నాయని, వాటిని తాము కోర్టుకు సమర్పిస్తున్నామని తెలిపారు. ఇది ఐటీ డిపార్ట్మెంట్కు తలనొప్పిగా ఉన్నప్పటికీ, దీనికి వస్తున్న స్పందన అనూహ్యంగా ఉందని పేర్కొన్నారు. ఇదో రకంగా
ప్రజల్లో ఉన్న స్పందనగా చూస్తున్నామని అన్నారు.