ఐదుగురు తెలంగాణ కార్మికులు సజీవ దహనం

dubai-fireదుబాయిలోని అబుదాబిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గల్ఫ్ డ్యూన్స్ అనే కంపెనీ కార్మికుల కోసం కల్పించిన వసతి సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మరికొంత మంది గాయాలతో బయటపడ్డారు. మృతులంతా తెలంగాణకు చెందినవారే. కంపెనీ యజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలంగాణ ఎన్నారై వెల్ఫేర్ అసోసియేషన్ విమర్శించింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి తగిన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది.