ఒలంపిక్‌ సంఘాన్ని ప్రక్షాళన చేస్తాం: కేశినేని చిన్ని

విజయవాడ,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం విూడియాతో మాట్లాడారు. ఏపీ ఒలింపిక్‌ సంఘం ఇంకా వైసీపీ నేతల కబ్జాలోనే ఉందని ఆరోపించారు. అసోసియోషన్‌లోని నలుగురు వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని, దాదాపు 340 కేసుల్లో అసోసియేషన్‌ చిక్కుకుందని విమర్శించారు. గత ప్రభుత్వం మితివిూరిన రాజకీయ జ్యోం వల్లే ఈ
దుస్థితి ఏర్పడిరదని వెల్లడిరచారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్‌ కేసులు పెడతామని తెలిపారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో భారీగా భూ అక్రమాలు జరిగాయని వివరించారు. అగ్రిగోల్డ్‌, దేవాదాయ, చెరువులు కూడా వేటినీ వైసీపి నాయకులు వదల్లేదని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి ప్రజలకు మేలు చేస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందు కృష్టాష్టమి వేడుకులో పాల్గొని పూజలు చేశారు.