ఓయీభూములు లాక్కోం :హోం మంత్రి నాయిని

3
హైదరాబాద్‌,మే30(జనంసాక్షి): ఓయూ భూముల్ని ఎవరూ లాక్కోరని తెలంగాణ ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆ భూములు విశ్వవిద్యాలయానికే చెందుతాయని, వాటిపై పూర్తి హక్కులు ఓయూవేనని ఆయన స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల్ని ప్రతిపక్షాలు తప్పుదోవపట్టించి దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఓయూ విద్యార్థులు అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు. ఓయూ భూముల ప్రజల భూములని, ఓయులో ఒక్క అంగుళం భూమి కూడా తీసుకునే పరిస్థితి ఉండదని నాయిని అన్నారు. మరోవైపు ఓయూ భూములపై సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళనలు ఉదృతం చేస్తున్నారు ఓ?్‌ విద్యార్థులు. ఇప్పటికే ఓయూ భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ పలు హోటళ్లు, పెట్రోల్‌ బంకులు, దుకాణాలపై ఓయూ విద్యార్థులు దాడి చేసిన సంగతి తెలిసిందే.