కడప పార్లమెంట్‎లో వైఎస్ షర్మిల ముందంజ..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రతి రౌండు ఓట్ల లెక్కింపులో పోటీ చేసిన అభ్యర్థులకు చమటలు పడుతున్నాయి. కడప లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డిపై వైఎస్ షర్మిల ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన వైఎస్ షర్మిల ముందు వెనుకబడినప్పటికీ ప్రస్తుతం లీడ్‎లో కొనసాగుతున్నారు. అయితే గతంలో అవినాష్‌ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో నిలిచి 7,83,499 ఓట్లకు గాను 63.79 శాతం ఓట్లు సాధించారు.