కనుమరుగైన కమలం వికసించని కమలం పువ్వు బిజేపి కార్యకర్తలు పరేషాన్ బషీరాబాద్, అక్టోబర్ 27

(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని కమలం పార్టీ కనుమరుగైందని, ఇంకెప్పుడు కమలం పువ్వు వికసిస్తుందని,ఎదురుచూపుల్లో పరేషాన్ అవుతున్న బిజెపి కార్యకర్తలు,అదేవిధంగా ప్రచారంలో ముందు స్థానంలో కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ,కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోర్ అందుకుందని, ఇప్పటివరకు తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ బిజెపి పార్టీ అధిష్టానం ఇప్పటివరకు కేటాయించకపోవడంతో కార్యకర్తలు పరేషాన్ చేస్తున్నట్లు,అదేవిధంగా సమయం దగ్గర పడుతున్న కొద్ది బిజెపి కార్యకర్తలు,బిజెపి అభిమానుల్లో టెన్షన్ మొదలైందని ఇప్పటి వరకు తాండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం ఎవరికి అనేది అధిష్టానం తేల్చకపోవడం ఆలోచనలో పడ్డామని బిజెపి కార్యకర్తలు పరేషాన్ చేస్తున్నట్లు తెలిపారు.