కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలంలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు

ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి
 మాధవరావుపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కావడంతో ఆస్థల సమస్యను పరిష్కరించి,  తెలంగాణ క్రీడా ప్రాంగణానికి కబ్జాకు గురైన భూమిని పరిశీలించినట్లు ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కజ్జాకు గురి కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిదని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ చక్రపాణి, ఏపీఓ కురుమయ్య, మాధవరావుపల్లి సర్పంచ్ సునీత,తదితరులు పాల్గొనడం జరిగింది.